ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ
గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ పూర్తి పాఠం , నమస్కరించి రాయునది ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులు చర్చనీయాంశమై ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ తీర్పుల పై నాకు బిన్నాభిప్రాయం ఉన్నప్పటికి నాటి సుప్రీం కోర్ట్ జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ చెప్పిన “జుడిషియల్ యాక్టివిజం “ ఇదని సరిపెట్టుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే నేను ఈ లేఖ తమకు పంపుతున్నాను. దీనిని రిట్ పిటిషన్ గా స్వీకరించి ప్రతిపక్ష నాయకుల కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేస్తారు అని విశ్వసిస్తున్నాను. ఈ లేఖతో పాటుగా నా దేశం నా స్వప్నం అనే ప్రచురణను జాతా పరచాను .నా ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం వాటి అమలుకై నేను 1995 నుండి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని అందులోనే ఉన్నాయి . ఇక్కడ మీ చొరవ - జోక్యం నా ప్రతిపాదనలు అమలుకి దోహద పడతాయి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖను తమకు పంపుతున్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ప్రాసెస్ మొదలు పెట్టింది కాబట్టి నెలకో- రెండు నెలలకో ఒక అవుట్ వచ్చే అవకాశం ఉంది. అయినా గత జూన్,29 నాడు వీటి పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యాలని కో